భర్త వేధింపులతో విసిగిపోయిన భార్య దారుణ నిర్ణయం తీసుకుంది. తన సోదరుడి సాయంతో భర్తని దారుణంగా చంపేసింది. ఈ అమానుష ఘటన చండీగఢ్లో చోటుచేసుకుంది. టిఒఐ కథనం మేరకు..ఫతేగఢ్ సాహిబ్ జిల్లా రాంపూర్ కలేరన్ గ్రామానికి చెందిన కరమ్జిత్ సింగ్ అలియాస్ రాజు అదే ప్రాంతానికి చెందిన కుల్దీప్కౌర్ని పదేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ముగ్గురు పిల్లలు. కరమ్జిత్ రైల్వే టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. మద్యానికి బానిసగా మారిన కరమ్జిత్ నిత్యం తాగొచ్చి భార్యని కొడుతుండేవాడు. భర్త చిత్రహింసలు భరించలేకపోయిన కుల్దీప్కౌర్ కోపంతో రగిలిపోయింది. రోజూ ఏడిపించే భర్త వద్దనుకుని దారుణ నిర్ణయం తీసుకుంది. భర్తని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఆధారాలు దొరక్కుండా హత్య చేసేందుకు పక్కాగా ప్లాన్ రూపొందించింది. తన సోదరుడు సన్నీ సాయంతో కట్టుకున్న భర్తని కిరాతకంగా హత్య చేసింది. ఆ ఏరియాలో సీసీకెమెరాలు లేవని.. ఆధారాలు దొరక్కుండా ఉండేందుకే ఆ ప్రదేశాన్ని ఎంచుకుని హత్య చేసినట్లు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు భార్య కుల్దీప్కౌర్, బావమరిది సన్నీ, ఆమె బంధువులు మణిందర్ సింగ్, పర్వీందర్ సింగ్లను అరెస్టు చేశారు.