ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాల్మీకి బోయలకు ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 07, 2020, 06:49 PM

కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలంలో పెద్దకడబూరు గ్రామ వాల్మీకి నాయకులు రామాంజినేయులు, యూత్ నాయకులు వీరేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి గతంలో అనేక సందర్భాలలో వాల్మీకి ఎస్టీ బోయలను పునరుద్ధాన అంశంతో కేంద్రానికి సిఫారసు చేస్తా అన్న మాటలను ఈరోజుకి దాదాపు 3,4 అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ వాల్మీకి బోయ పునరుద్దాన గురించి ప్రస్తావన లేదని తెలిపారు.ఈ ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా వాల్మీకి జనాభా 40 లక్షలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకులకు కేవలం ఒక ఎంపీ స్థానాన్ని, ఒక మంత్రి స్థానాన్ని ఇవ్వడం జరిగింది అని అన్నారు. గతంలో వాల్మీకుల పరిస్థితి ఏవిధంగా ఉంది అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్టంలో మాత్రమే రెండు రిజర్వేషన్లు కోస్తా, ఆంధ్ర జిల్లాలో వాల్మీకులు ఎస్టీలుగా ఉన్నారు. రాయలసీమ ప్రాంతాలలో బీసీలుగాఉన్నారు. దేశం మొత్తం వాల్మీకులు ఎస్సి, ఎస్టీ గా ఉన్నారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే బోయులను ఎస్టీలో చేరుస్తామన్నారు.కానీ ఇప్పుడు వాల్మీకులు అంటే వేటకు పోయే వారని, ఇప్పుడు జన స్రవంతి లో కలిసిపోయారని, ఇప్పుడు మీరు వాల్మీకులపైన వేట సాగిస్తున్నారు అని అన్నారు. రాబోయే రోజుల్లో రాయలసీమలో ఉన్న వాల్మీకులను సంక్షేమం వైపు ముందుకు తీసుకు వెళ్లకపోతే వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఏంగతి పట్టిందో అదే గతి పడుతుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి నాయకులు హనుమంతు, అంజినయ్య, సుంకన్న, వీరేష్, కల్లుకుంట వాల్మీకి నాయకులు రామాంజినేయులు, గిడ్డయ్య తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com