కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలోని గోకవరం గ్రామ సచివాలయంలో గ్రామ హార్టికల్చర్ సహాయకులు టి.సాయి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామ రైతులకు అవగాహన కలిపించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ.. గ్రామంలో కౌలుకు పొలం వేసుకోను ప్రతి రైతు సి. సి.ఆర్. సి. కార్డు కలిగి ఉండాలి అని తెలిపారు. సి.సి.ఆర్. సి కార్డ్ కలిగి ఉండటం వలన పంట నష్టపరిహారం, పంటల బీమా, సున్నా వడ్డీ లబ్ది మరియు కనీస మద్దతు ధర చెలిస్తూ ప్రభుత్వం వారు చేయు పంట కొనుగోళ్ళకు ఉపయోగపడుతుంది.రైతు పెట్టుబడి సాయం అందిచేందుకు అమలు చేస్తున్న రైతు భరోసా పథకంనకు అర్హత పొందవచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సునీల్, వ్యవసాయ విస్తరణ అధికారి యమ్. వెంకట నారాయణ, గ్రామ హార్టికల్చర్ సహాయకులు సాయి, బహుళ విస్తరణ అధికారి ఉమామహాశ్వరి, పంచాయతీ కార్యదర్శి నిర్మల, వీఆర్వో మల్లికార్జున గ్రామ వాలంటరీలు మరియు రైతులు పాల్గొన్నారు.