ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణా జిల్లాలో ఘోర కారు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 04, 2020, 11:20 AM

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం పరిధిలో ఘోర  ప్రమాదం జరిగింది. కరకట్టపై కారు అదుపుతప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రయాణిస్తుండగా.. తల్లి మహాలక్ష్మి(33), కుమారుడు మహంతి(5) మృతి చెందారు. భర్త కిరణ్​ కుమార్​, మరో కుమారుడు(11 నెలలు) ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. వీరంతా అవగనిగడ్డ నుంచి గుంటూరు జిల్లా పెనుమాక వెళ్తుండగా ఈప్రమాదం జరిగింది. విషయం తెలిసిన వెంటనే స్థానిక సీఐ సత్యనారాయణ, తహసీల్దార్ భద్రు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. యంత్రం సహాయంతో కారును కాల్వ నుండి బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక పోలీసులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కారు కాలువలోకి దూసుకెళ్లింది. కళ్ల ముందే భార్య, కుమారుడు మృతి చెందడంతో ఆ తండ్రి , మరో కుమారుడు విలపిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com