కొత్తగా కారు లేదా టూవీలర్ కొనాలని యోచిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. వాహన ధరలు ఈరోజు నుంచి దిగిరానున్నాయి. దీంతో ఇకపై కొత్త వెహికల్ కొనే వారికి ఊరట కలుగనుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఆగస్ట్ 1 నుంచి లాంగ్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ను ఉపసంహరించుకోనున్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) దీనికి సంబంధించి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అంతే ఇకపై 3, 5 ఏళ్లకు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవలసిన అవసరం లేదు.ఈ నేపథ్యంలో కొత్తగా కారు లేదా టూవీలర్ కొనుగోలు చేసే వారికి తొలి ఏడాది ఇన్సూరెన్స్ భారం తగ్గుతుంది. దీంతో మొత్తంగా వెహికల్ ఆన్రోడ్ ధర కూడా దిగివస్తుంది. దీంతో ఆగస్ట్ 1 నుంచి కొత్తగా టూవీలర్ లేదా కారు కొంటే మాత్రం కొంత మేర డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఆగస్ట్ 1 నుంచి ఒక ఏడాదికే వెహికిల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఈ పాలసీని రెన్యువల్ చేసుకుంటూ రావాలి.