త్వరలో కలర్ టీవీల ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. ఒకప్పుడు 32 ఇంచుల ఎల్ఈడీ టీవీ రూ.30 వేలు పెడితే కానీ వచ్చేది కాదు. కానీ వీయూ,కొడాక్,ఎంఐ వంటి కంపెనీలు వచ్చారు. రూ.10వేలకే 32 ఇంచుల టీవీ దొరుకుతుంది. చైనాతో వివాదం పెరిగిన తర్వాత భారత్ కాస్త కఠినంగానే వ్యవహరిస్తుంది. తాజాగా కలర్ టీవీల దిగుమతుల పై నియంత్రణలు విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 32 సెంటీమీటర్ల నుంచి 105 సెంటీమీటర్ల పరిమాణంలోని ఎల్ఈడీ టీవీలు, 63 సెంటీమీటర్ల కంటే తక్కువ పరిమాణంలోని ఎల్సీడీ టీవీలు నియంత్రణ పరిధిలోకి వస్తాయి.ఇప్పటి వరకు టీవీలను స్వేచ్ఛగా దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. కానీ తాజాగా దానిని నియంత్రణ పరిధిలోకి తీసుకొచ్చినట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (DGFT) విభాగం ప్రకటన జారీ చేసింది. ఇక పై విదేశాల నుంచి టీవీలను దిగుమతి చేసుకోవాలంటే తప్పకుండా కేంద్ర వాణిజ్య శాఖ పరిధిలోని DGFT నుంచి లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. కేంద్రం విధించిన ఆంక్షలతో చైనా నుంచి దిగుమతులు తగ్గనున్నాయి. దీంతో భారత్ లో టీవీల ధరలు పెరగనున్నాయి.