ఏపీలో విద్యావారధి మొబైల్ వ్యాన్ ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. అనేక మంది విద్యార్దులకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞాన అనుభవం లేదని వారి కోసమే ఈ మొబైల్ వ్యాన్ లు ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాలకు విద్యా వారధి మొబైల్ వాహనాలు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి సురేష్ తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కరోనా సమయంలో విద్యకు దూరంగా ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో సప్తగిరి ఛానెల్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని మంత్రి తెలిపారు.