జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)పై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కామన్ లా అడ్మిషన్ టెస్టును దేశవ్యాప్తంగా కేవలం ఇంగ్లీషులో మాత్రమే నిర్వహిస్తోంది. అయితే దేశవ్యాప్తంగా ఇంగ్లీష్లో ఎగ్జామ్ నిర్వహించడం వల్ల ఆయా రాష్ట్రాల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో క్లాట్ పరీక్షను తెలుగుతో పాటు ఇతర ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని బార్ కౌన్సిల్ భావించింది. అందులో భాగంగానే ప్రాంతీయ భాషల్లో క్లాట్ పరీక్ష నిర్వహణ కోసం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏడుగురు సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది.