ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెవెన్యూశాఖ ప్రక్షాళనకు చంద్రబాబు నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 20, 2017, 10:36 AM

అమరావతి: రెవెన్యూశాఖ ప్రక్షాళనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కసరత్తు ముమ్మరం చేశారు. రెవెన్యూశాఖ రూపురేఖలను సమూలంగా మార్చి దానిని ప్రజలకు చేరువయ్యేలా చూడాలని నిర్ణయించారు. ఇందుకోసం ఉద్యోగుల కోసం ఆయన వర్క్ షాపు నిర్వహించబోతున్నారు. అవినీతికి మారుపేరుగా మారిన ఈ శాఖను ఎలాగైనా సంస్కరించాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. దీంతో సీఎంవో రంగంలోకి దిగింది.

 

రెవెన్యూశాఖ ప్రక్షాళనకు తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న ఆ శాఖ అధికారులు ఆగమేఘాలపై కార్యచరణకు దిగారు. రెవెన్యూశాఖ పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారని శాఖ గౌరవాన్ని పెంచేందుకు ఏం చేస్తే బాగుంటుందో సలహాలు, సూచనలు ఇవ్వాలంటూ రెవెన్యూశాఖలోని కిందిస్థాయి అధికారులకు లేఖలు రాసింది. త్వరలోనే అంతర్మధనం సదస్సులు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com