ఏపీపై కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 8,066 శాంపిల్స్ను పరీక్షించగా 79 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు హెల్త్ బులిటెన్లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 94మంది, విదేశాల నుంచి వచ్చిన మరో ఏడుగురికి కరోనా నిర్థారణ అయ్యింది. ఈ మొత్తం కేసుల సంఖ్య 180గా నమోదయ్యాయి. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 3279కు చేరాయి. మరో 35మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 967కు చేరింది. గత 24 గంటల్లో కోవిడ్ వల్ల నలుగురు చనిపోయారు.. చిత్తూరు జిల్లాలో ఇద్దరు.. కృష్ణా జిల్లా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 68మంది చనిపోయారు.