ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వాటికి సంబంధించిన వివరాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాకు వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే…“లోన్ మారటోరియం సదుపాయాన్ని మరో 3 నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాం. టర్మ్ లోన్ తీసుకున్న వారు మరో 3 నెలలు ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం లేదు. ఆగష్టు 31 వరకు రుణ తాత్కాలిక నిషేదాన్ని ఆర్బీఐ పొడిగిస్తుంది. అదే విధంగా రెపో రేటు 4 శాతం మేర తగ్గిస్తున్నాం. దీంతో రుణ రేట్లు మరింత దిగిరానున్నాయి. మీరు ఈ 6 నెలల్లో మీ ఈఎంఐ చెల్లించకపోతే, మీ రుణం డిఫాల్ట్ లేదా ఎన్పీఏ కేటగిరీలో పరిగణించబడదు.” అని ఆయన తెలిపారు.