దర్శి, మేజర్న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యాప్తికి 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక మంత్రి శిద్ధా రాఘవరావు పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గ కేంద్రమైన దర్శిలోని శ్రీనివాస పద్మావతి కల్యాణ మండపంలో జరిగిన 5వ రోజు ‘నవ నిర్మాణ దీక్ష’ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత మంత్రి ఆరోగ్య శిబిరంలో స్వయంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మహిళలకు దీపం గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారు. స్ర్తీ శిశు సంక్షేమ ఆధ్వర్యంలో చిన్నారులకు మంత్రి అన్న ప్రాసన చేశారు. గర్భిణీ స్ర్తీలకు ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి సీమంతం చేసి అశీర్వదించారు. ఈ సందర్భం గా ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో లేని విధంగా 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రతీ ఒక్కరిని విద్యా వంతులను చేస్తోందన్నారు. కర్మాగారాలు, హోటళ్ళల్లో పని చేసే బడి ఈడూ పిల్లలందరినీ బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా తిరిగి పాఠశాల్లో చేర్పించడం జరగుతుందన్నారు. డీఎస్సీ నిర్వహించి 8,926 మందికి ఉపాధ్యా యులుగా నియామకాలు ఇవ్వడం జరిగిందన్నారు. 8,9 తరగతి బాలికలకు 79.50 కోట్ల రూపాయలతో ఒక లక్షా 89 వేల సైకిళ్లును బడికోస్తా కార్యక్రమం ద్వారా పంపిణీ చేసి బాలిక విద్యా ప్రోత్సహిస్తు న్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్ధులకు ఉచితంగా విదేశీ విద్యను అందిస్తున్నామన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో 3,444 కోట్ల రూపాయల వ్యయంతో మౌళిక సదుపాయాలు కల్పిస్తు న్నామన్నారు. వైద్య రంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తెచ్చా మన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఆరోగ్య, ప్రయోగశాల పరీక్షలు అందిస్తున్నా మన్నారు. తల్లిబడ్డి ఎక్స్ప్రెస్ ద్వారా తల్లిబిడ్డలను సురక్షితంగా వారి ఇంటికి చేరుస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలపై రోజుకు ఒక రంగు దుప్పటి చొప్పున దేశంలో ఎక్కడా లేనివిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పుటకు అనువైన వాతావరణం ఉందని, గత 2 సంవత్స రాల్లో 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలకు శంఖుస్ధాపన తప్పకుండా జరుగుతుందన్నారు. తద్వారా వేల మంది నిరుద్యో గులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
దర్శి నియోజకవర్గంలో గత 20 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి 3 సంవత్సరాల్లో జరిగిందని, 1700 కోట్ల రూపాయల వ్యయంతో అనేక రహదా రులు, వంతెనలు నిర్మించడం జరుగుతోందన్నారు. దర్శిలో అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్, కురిచేడులో సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల ఏర్పాటు అవుతున్నాయని చెప్పారు. గ్రామీణ ప్రజలకు సురక్షిత మంచి నీరు అందించాలనే ఉద్ధేశ్యంతో తన సొంత నిధులు ఒక్కొక్క యూనిట్ 4 లక్షల రూపాయల వ్యయంతో ఇప్పటికే 64 ఆరోగ్య ప్లాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గతంలో విద్యుత్ సరఫరా సరిగా ఉండేది కాదని, నేడు గృహాలకు, పరిశ్రమలకు 24 గంటలు, వ్యవసాయానికి 7 గంటలు విద్యుత్ను అందిస్తున్నామన్నారు. అనంతపురం నుంచి అమరావతి రాజధానికి 30 వేల కోట్ల రూపాయల వ్యయంతో 6 వరుసల ఎక్స్ప్రెస్ రహదారినీ ఏర్పాటు చేస్తు న్నామన్నారు. ఈ సందర్బంగా విద్యార్ధినులు ప్రదర్శించిన అమరావతి నృత్య గీతం ఆహుతులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి డాక్టర్ బీ రవి, మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు, ఎఎంసీ ఛైర్మన్ సూరె చిన్న సుబ్బారావు, సర్పంచ్ జిసి గురువయ్య, కనీస వేతనాల కమిటీ సభ్యురాలు శోభారాణి, డీఎస్సీ రాంబాబు, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ పద్మావతి, కురిచేడు, దొనకొండ ఎంపీపీలు జి వెంకటరత్నమ్మ, గాలెమ్మ, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల తహసీల్ధార్లు, మండల విద్యా ధికారులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు, కార్యకర్తలు, ప్రజ లు, విద్యార్ధినీలు పాల్గొన్నారు.