విద్యోన్నతి, నైపుణ్యాభివృద్ధి పథకాల కింద టీడీపీ హయాంలో రూ. 250 కోట్లకు పైగా దుర్వినియోగం జరిగిందని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. లేని వ్యక్తులకు చెల్లింపులు చేశారని మంత్రి అన్నారు. టీడీపీ తరహాలో వివిధ శాఖల నిధులను మేము మళ్లించలేదు. టీడీపీ తరహాలో పసుపు- కుంకుమ పతాకానికి మళ్లించినట్లు చేయలేదు అని అయన అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం ద్వారా ధర్మవరంలో ఓ కుటుంబానికి రూ. లక్షకు పైగా లబ్ది పొందిన పరిస్థితి ఉంది అని అయన తెలిపారు. బీజేపీతో మేము ఎందుకు జత కడతాం అని అయన అన్నారు.