కాసేపట్లో గవర్నర్ తో ఏపీ మండలి చైర్మన్ షరీఫ్ భేటీ కానున్నారు. గవర్నర్ కు మండలి పరిణామాలపై మండలి చైర్మన్ షరీఫ్ వివరించనున్నారు. సెలెక్ట్ కమిటీల వ్యవహారంలో కౌన్సిల్ కార్యదర్శి తీరుపై పిర్యాదు చేయనున్నారు. కౌన్సిల్ చైర్మన్ ఆదేశాలను సెక్రటరీ పాటించకపోవడంపై వివాదం చెలరేగింది. ఈ మొత్తం వ్యవహారంపై గవర్నర్ కు మండలి చైర్మన్ షరీఫ్ వివరించే అవకాశం ఉంది.