కియా పరిశ్రమ తరలిపోతుందనే వార్తలు విని ఆశ్చర్యపోయానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. కియా వేరే చోటకు వెళ్తోందనే వార్తలు రావడం ప్రభుత్వ లోపమే అని పవన్ అన్నారు. మిలీనియం టవర్స్ నుంచి సాఫ్ట్ వేర్ సంస్థలను ఖాళీ చేయించారు అని అన్నారు. రూ. 24 వేల కోట్లతో కాగితం పరిశ్రమ పెడతామన్న ఆసియన్ సంస్థ మహారాష్ట్రకు వెళ్లిందని అయన అన్నారు. ఉపాధి కల్పించే రంగాలను ప్రభుత్వం ప్రోత్సహించాలి అని అన్నారు. ప్రణాళిక లేని పాలకపక్షం వల్లే పారిశ్రామిక రంగం తరలిపోతోంది.