ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి జరగాల్సిన రోజు ..యువతిపై అనుకోని అఘాయిత్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 30, 2017, 11:54 AM

తెల్లారితే పెళ్లి.. మూడు ముళ్లు వేయించుకుని వైవాహిక జీవితంలోకి ప్రవేశించాల్సిన ఆ యువతిపై అనుకోని అఘాయిత్యం జరిగింది. స్నేహితులతో కలిసి ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కీచకుడు. తీవ్రంగా గాయపడి, అపస్మారక స్థితిలోని ఆమెను పొలాల్లో వదిలివెళ్లాడు. దీంతో వివాహం ఆగిపోగా, ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలంలోని ఒక గ్రామంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది.


సోమవారం ఉదయం ఆ యువతి పెళ్లి. ఆదివారం రాత్రి సమయంలో పొలాల్లోకి బహిర్బుమికి వెళ్లిన ఆమెను అదే ఊరికి చెందిన మల్లిపూడి సత్యనారాయణ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేశాడు. ఊరికి దూరంగా తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ప్రతిఘటించిన ఆమెను తీవ్రంగా గాయపరచడంతో ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను పొలాల్లోనే వదిలిపెట్టి సత్యనారాయణ, అతడి స్నేహితులు పారిపోయారు.


పెళ్లి కూతురు ఎంత సేపటికీ రాకపోవడంతో పెళ్లింట్లో ఆందోళన మొదలైంది. ఆమె ఎక్కడుందనే విషయాన్ని ఆదివారం రాత్రంతా కనుక్కోలేకపోయారు. సోమవారం ఉదయం ఆమె జాడ తెలిసింది. పరిస్థితి అర్థం అయ్యింది. వివాహం ఆగిపోయింది. పెళ్లి జరగాల్సిన రోజు కూతురు అఘాయిత్యానికి బలికావడంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన భరితులయ్యారు. మెరుగైన చికిత్స కోసం ఆమెను రాజమండ్రికి తరలించారు. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com