ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్త గురించి షాకింగ్ నిజాలు బయటపెట్టిన పోసాని సతీమణి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 02, 2020, 02:19 PM

ఆయనకు కోపమెక్కువ.. చూడ్డానికి తిక్క మనిషిలా కనిపిస్తారు. ఆయన కోపాన్ని తట్టుకోలేక పెళ్లైన కొత్తగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకొందట పోసాని కృష్ణమురళి భార్య కుసుమ లత. పోసాని తో తన పెళ్ళి అయి 29 సంవత్సరాలు నిండి 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపధ్యంలో కుసుమ లత తన భర్త పోసానితో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. పెళ్లైన కొత్తలో ప్రతి చిన్న విషయానికి పోసాని చికాకు పడుతూ ఉండేవాడు. ఆ తిక్క తట్టుకోలేక తాను అప్పట్లో చనిపోవాలని నిర్ణయించుకుని ఆ లెటర్ వ్రాసిన విషయాన్ని తెలియచేసింది. కోపం వచ్చినప్పుడు గొంతు పెంచి మాట్లాడుతాడు తప్ప అతడు ఎంత మంచి వ్యక్తి అన్న విషయం తనకు తెలియడానికి చాల సంవత్సరాలు పట్టిందని చెప్పుకొచ్చింది.


గతంలో తనకు అనారోగ్యం వచ్చి తన ప్రాణానికి ముప్పు అన్న విషయం తెలుసుకుని పోసాని తన కోసం అన్నం స్నానం మానివేసి 10 రోజులపాటు హాస్పటల్స్ చుట్టూ తిరిగిన తన భర్తను చూసినప్పుడు అతడిని తాను ఎందుకు అపార్ధం చేసుకున్నానా అన్న ఫీలింగ్ కలిగింది. ఒక స్త్రీని పోసాని గౌరవించినంతగా మరెవ్వరు గౌరవించరని పోసాని గురించి గొప్పగా చెప్పుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com