ఏప్రిల్ నెల నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం పంపిణీ ప్రారంభించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, ఇతర సీనియర్ ఉన్నతాధికారులతో ఆ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా జగన్ మాట్లాడుతూ…. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్యాక్ చేసిన నాణ్యమైన బియ్యం పంపిణీ అమలుపై సమీక్షలో ప్రధానంగా చర్చించారు. నాణ్యమైన బియ్యం నిల్వలపై అధికారులు సీఎం జగన్కు వివరాలు అందించారు.