తిరుమల: టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా సుధామూర్తి ప్రమాణ స్వీకారం చేశారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్గా ఉన్న సుధామూర్తిని టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా ఈవో సాంబశివరావు ప్రమాణ స్వీకారం చేయించారు. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన శేఖర్రెడ్డిని బోర్డు సభ్యుడిగా ప్రభుత్వం తొలగించింది. శేఖర్రెడ్డి స్థానంలో సుధామూర్తికి అవకాశం కల్పించింది.