ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయ ఎజెండాతో ముందుకెళుతున్న కోదండరాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 19, 2017, 02:45 AM

 -కోదండ ముసుగు తొలగిపోయింది  మా అనుమానాలు    


-నిజమేనని తేలిపోయింది  టీ+జాక్‌ అవసరం తీరిపోయింది


 -నిజాలు చెప్పాల్సిన కోదండ, అబద్దాలు చెబుతున్నారు


 -టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌


హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : టీ-జాక్‌ చైర్మన్‌ కోదండరాం మొదటినుంచి రాజ కీయ ఎజెండాతో ముందుకువెళ్తున్నట్టు తేటతెల్లమైందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ విమర్శించారు. పార్టీ పెట్టడంపై తాజాగా కోదండరాం చేసిన వ్యాఖ్యలు తమ అనుమానాలు నిజమేనని నిరూపించాయన్నారు.  అన్ని వర్గాలు తెలంగాణ ఉద్యమంలో కలిసి రావాలని ఆనాడు కేసీఆర్‌ టీ-జాక్‌ని ఏర్పాటు చేశారని  గుర్తు చేశారు. కోదండరాం ను చైర్మన్‌ గా చేసింది కేసీఆర్‌ యేనని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటుకాగానే జేఏసీ అవసరం తీరిపోయిందని,  తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలు వైదొలిగినా ప్రజా సంఘాలతో కొనసాగుతున్న జేఏసీ రాజకీయాలే లక్ష్యంగా పనిచేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్‌గా నిజాలు చెప్పాల్సిన కోదండరామ్‌ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. ఉద్యోగ నియామకాలపై ఆయన చేస్తున్న ప్రకటనలు తప్పని నిరూపించేందుకు వాస్తవాలతో కూడిన పత్రాన్ని ఆయనకు పంపిస్తామన్నారు. దాదాపు 32వేల ఉద్యోగాలను ప్రభుత్వం ఇప్ప టికే రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసిందని, అయినా ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ  కోదండరాం కాంగ్రెస్‌ పార్టీ మౌత్‌ పీస్‌గా మారారని విమర్శించారు. నాలుగు రోజుల కింద ఉత్తమ్‌ నోటి నుంచి వచ్చిన మాటలే ఇప్పుడు కోదండరాం మాట్లా డుతున్నారన్నారు.  కోదండరాం ముసుగు తొలిగిందని,  ఆయన పట్ల ప్రజల్లో భ్రమలు కూడా తొలిగి పోయాయని కర్నె ప్రభాకర్‌ అన్నారు. కోదండ రామ్‌ కు పార్టీ పెట్టె హక్కు ఉందన్న ప్రభాకర్‌,  పార్టీ పెట్టి కాంగ్రెస్‌ తో పొత్తుపెట్టుకుని కొన్ని సీట్లు తనవారికి ఇప్పించుకోవాలన్నదే ఆయన తపనగా కనిపిస్తోందన్నా రు. రాజకీయేతర సంఘాల ముసుగులో కోదండరాం రాజకీయాలు చేయడం సైనే తాము మా అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నామని చెప్పారు.  నిరుద్యోగులను రెచ్చగొట్టేందుకే కోదండరాం ర్యాలీకి పిలుపు నిచ్చారని ప్రభాకర్‌ అన్నారు. నిరు ద్యోగ ర్యాలీ ద్వారా  హింసను ప్రేరేపించేందుకు యత్నిస్తూ, ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కోదండరాం ర్యాలీకి అనుమతి ఇవ్వాలా? వద్దా అనేది పరిస్ధితులను బట్టి డీజీపీ నిర్ణయం తీసుకుంటారన్నారు. అబద్దాల తో నిరుద్యోగ యువతను రెచ్చగొట్టి అశాంతి నెలకొంటున్నదంటూ కోదండ రామ్‌ మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తా మని కేసీఆర్‌ ఇచ్చిన హామీని ప్రభుత్వం తప్పకుండా నెరవేరుస్తుంద న్నారు. అంతవరకు కోదండరాంకు తొందరపాటు తగదని కర్నె ప్రభాకర్‌  పేర్కొన్నారు. 


కాంగ్రెస్‌ పీఆర్వోగా పనిచేస్తున్న కోదండరాం


తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం కాంగ్రెస్‌పార్టీ పీఆర్వోగా పని చేస్తున్నారని  ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి ఆరోపించారు. కోదండరాం వ్యవహా రశైలి వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా రు. అన్ని కులాల అభివృద్ధికి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. కేసీఆర్‌పై కోదండరాం దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. ఉద్యోగాల భర్తీలో  దేశం లోనే తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో ఉందన్నారు. నిరుద్యోగుల ర్యాలీలో అమెరికాలో నీ బిడ్డ, కొడుకు ముందు వరుసలో ఉంటారా? అని కోదండరాం ను ఉద్దేశించి ప్రశ్నించారు. విద్యార్థులు ర్యాలీలో పాల్గొన వద్దని విజ్ఞప్తి చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com