అవకాశం కల్పించని 6 ఉపాధ్యాయ సంఘాలు
బీసీ ఉపాధ్యాయ సంఘం బరిలోకి అభ్యర్థి
చాప కింద నీరులా గెలుపు కోసం కృషి
కాటేపల్లి గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ
మంత్రి హరీష్రావుకు బాధ్యతలు
గెలుపు ఏకపక్షమేనా? ఉనికినికోసం బీసీ,
వామపక్ష పార్టీలు బలపరచిన అభ్యర్థుల ఆరాటం
హైదరాబాద్, మేజర్న్యూస్ : హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 6 ఉపాధ్యాయ సంఘాలు బీసీ అభ్యర్థికి అవకాశం ఇవ్వక పోవడం పట్ల బడుగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారపార్టీ తిరిగి అగ్రవర్గానికి చెందిన జనార్ధన్రెడ్డి అవ కాశం కల్పించడం పట్ల బడుగు అధ్యాపకులు తీవ్ర అసం తృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బడుగు అభ్యర్థులు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హులు కారా? అని వారు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ ఉపాధ్యాయ సంఘం నుంచి పోటీ చేస్తున్నా డా.ఎస్.విజయ్కు మార్ను గెలిపించుకునేందుకు బడుగు ఉపాధ్యాయులు చాపకిందనీరులా పనిచేస్తున్నారు. ఇక అధికారపార్టీ బలప రుస్తున్న కాలేపల్లి జనార్దన్రెడ్డి విజయావకాశాలు రోజు కింత మెరుగుపడుతున్నాయి. జనార్దన్రెడ్డి గెలుపే లక్ష్యం గా అధికారపార్టీ వ్యూహాలను రచిస్తోంది. నాంపల్లిలోని రోజ్ ఫంక్షన్ హాల్లో ఉపాధ్యాయ సంఘాలతో మహబూ బ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల టీఆర్ఎస్ బలప రుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి కాటేపల్లి జనార్ధన్రెడ్డి సమావేశ మయ్యారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి మహ ముద్ అలీ, ఎన్నికల ఇంచార్జి, రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు, పంచాయితీరాజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పాడిపరిశ్రమాభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రవాణాశాఖ మంత్రి మహేం దర్రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డిలు హాజరయి, జనా ర్దన్రెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేయాలని అధ్యాపకుల ను కోరారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలప రుస్తున్నా జనార్ధన్రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలు స్తారని ఎన్నికల ఇంచార్జిగా నియమితులైన మంత్రి హరీ ష్రావు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి రోజు ఒక జిల్లా సమావేశానికి అందరూ హాజరుకావాలన్నారు. ఎంత బలంగా గెలిపించుకుంటామో, అంతే బలంగా సమస్య పరిష్కరించుకుందామని చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుంటామని తెలిపారు. కాటేపల్లి జనార్ధన్రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలి పించాలని మంత్రి లక్ష్మారెడ్డి ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభు త్వం కృషిచేస్తున్నదని చెప్పారు. దశాబ్ధాలుగా సాధ్యం కాని హెల్తకార్డుల సమస్య పరిష్కరించామని గుర్తు చేశారు. జనార్ధన్రెడ్డికి మద్దతు తెలిపి బంగారు తెలంగాణ సాధ నకు సహకరించాలని ఇతర మంత్రులు ఉపాధ్యాయులను కోరారు. మూడు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేడి రాజు కుంది. ఈ ఎన్నికలకు కాంగ్రెస్పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఏ అభ్యర్థికి ఆపార్టీ మద్దతునిచ్చే అంశంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వామపక్షపార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులతో పాటు, బీసీ ఉపాధ్యాయ సం ఘం బలపరుస్తున్న అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ, పోటీ ఏకపక్షంగానే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తమ ఉనికిని చాటుకునేందుకు వామపక్షపార్టీలు బలపరుస్తున్న అభ్యర్థులతో పాటు, బీసీ ఉపాధ్యాయసం ఘం బలపరుస్తున్న అభ్యర్థులు తీవ్రంగా కృషిచేస్తున్నారు. బీసీ ఉపాధ్యాయసంఘం బలపరుస్తున్న అభ్యర్థి తరుపున జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ప్రచారాన్ని నిర్వహిస్తుండడం ఆయనకు కొంత లాభించే అవకాశాలు లేకపోలేదు. ఇక అధికారపార్టీ బలపరుస్తున్న కాటేపల్లికి, ప్రధాన పోటీ వామపక్షపార్టీలు బలపరుస్తున్న అభ్యర్థి నుంచే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కాటేపల్లి నామినేషన్ దాఖలు
అధికారపార్టీ బలపరుస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాటేపల్లి జనార్ధన్ రెడ్డి నేడు తన నామినేషన్ దాఖలు చేశారు. జనా ర్దన్రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, రవాణాశాఖమంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు హజరయ్యారు. ఈ సంధర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా తామే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. ప్రజలకు తమప్రభుత్వంపై పూర్తి్త విశ్వాసం ఉన్నదని, ఉపాధ్యాయవర్గ సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు.