రాష్ట్రంలోని విల్లుపురం సమీపంలోని సలామత్నగర్లో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యుల స్వర్ణకార కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ముగ్గురు కుమార్తెలకు విషమిచ్చి దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆన్లైన్ లాటరీకి ఈ కుటుంబం బలైపోయినట్లు స్థానికుల సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు అరుణ్, శివగామి, ప్రియదర్శిని(5), యువశ్రీ(3), భారతి(నాలుగు నెలలు)గా గుర్తించారు. విల్లుపురం డీఎస్పీ శంకర్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.