ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోహిత్ శర్మ టాప్ రికార్డ్‌...అడుగు దూరంలో కోహ్లి

national |  Suryaa Desk  | Published : Sun, Dec 08, 2019, 10:41 AM

విండీస్ తో తొలి టీ20 మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 208 పరుగుల ఛేదనలో విరాట్ కోహ్లీ (94 నాటౌట్: 50 బంతుల్లో 6x4, 6x6) భారీ ఇన్నింగ్స్ ఆడటంతో టీమిండియా మరో 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదడం ద్వారా టీ20ల్లో రోహిత్ శర్మ పేరిట ఉన్న అరుదైన రికార్డ్‌ని బద్దలుకొట్టిన విరాట్ కోహ్లీ నెం.1 స్థానానికి ఎగబాకాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకూ అత్యధిక అర్ధశతకాలు సాధించిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ 22 హాఫ్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. ఉప్పల్ టీ20లో 23వ హాఫ్ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ అతడ్ని వెనక్కి నెట్టి నెం.1 స్థానాన్ని అధిరోహించాడు. ఇక రికార్డ్‌లో కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత వరుసగా మార్టిన్ గప్తిల్ (17 హాఫ్ సెంచరీలు), పాల్ స్ట్రిర్లింగ్ (16), డేవిడ్ వార్నర్ (16) టాప్-5లో కొనసాగుతున్నారు. టీ20లో టాప్ స్కోరర్ రికార్డ్‌కి మాత్రం కేవలం మూడు పరుగుల దూరంలోనే విరాట్ కోహ్లీ నిలిచిపోయాడు. ఇప్పటి వరకూ 102 అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ శర్మ ప్రస్తుతం 2,547 పరుగులతో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. విరాట్ కోహ్లి 73 మ్యాచ్‌ల్లో 2,544 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక వెస్టిండీస్‌తో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలవగా.. రెండో టీ20 మ్యాచ్‌ తిరువనంతపురం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకి జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com