ఢిల్లీలోని అనాజ్ మండి అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అయన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అని అయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 43కి చేరింది. 30 ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.