బెంగళూరు: కర్ణాటకలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. అయితే స్థానికుల అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అసలేం జరిగిందంటే..
కర్ణాటకలోని గడగ్ జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దీని వల్ల రోడ్లు దెబ్బతిన్నాయి. ఓ బస్సు వెళ్తున్న సమయంలో రోడ్డు కుంగిపోవడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న వాగులో పడిపోయింది. గమనించిన స్థానికులు ప్రయాణికులను రక్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. బస్సు వెనుక ద్వారానికి పొడవాటి తాడును కట్టి.. ప్రయాణికులను రక్షించారు. వాగులో నీటిప్రవాహం ఎక్కువగా ఉండటంతో బస్సు ముందుకు కదిలింది. అయినప్పటికీ.. స్థానికులు శ్రమించి.. వారిని కాపాడారు.