హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లలో బెట్టింగ్లకు పాల్పడుతున్న ఎనిమిది మంది ముఠాను గుంటూరు పోలీసులు అరెస్టుచేశారు. వారి నుంచి రూ.2.6లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు, రెండు పాకెట్ డైరీలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు కంకరగుంట గేటు సమీపంలో పరుపులు, దిండ్లు అమ్ముతున్న దుకాణంలో కంభంపాడు గ్రామానికి చెందిన బాలాజీకి చెందిన లైవ్ఫోన్లో శ్రీనివాసరావు అనేవ్యక్తి బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు బెట్టింగ్ నిర్వహణ శిబిరంపై దాడిచేసి లైవ్ఫోన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిని అరెస్టుచేశారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది ముఠాగా ఏర్పడి నిర్వహిస్తుండగా.. వారిలో ఏడుగురిని అరెస్టుచేశామని, ఒకరు పరారీలో ఉన్నట్టు ఏఎస్పీ భాస్కర్రావు తెలిపారు.