తాడేపల్లిగుడెం, సూర్య బ్యూరో : దేశంలో మొట్టమొదటిగా అంతర్జాతీయ ఏసీ రైతుబజార్ను తాడేపల్లిగూడెం పట్టణంలో రూ.2.5 కోట్ల ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి పైడికొండల మాణిక్యా లరావు అన్నారు. రైతుబజారు నిర్మాణానికి స్థలం దొరక్క పోవడంతో కొంత జాప్యం జరిగిందన్నారు. ఇప్పడు స్థలం కేటాయించడంతో రైతుబజారు నిర్మాణా నికి టెండర్ల ప్రక్రియకు సన్నాహాలు చేస్తున్నామని.. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అలాగే స్థానిక గణేశ్న గర్లోని గణేశ్ గుడి వద్ద ఇండోర్ స్టేడియం నిర్మించేందుకు అనుమతి మంజూ రైందని త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి వివరించారు. పట్టణంలో కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారని వారికోసం 30 గదులతో కూడిన అధునిక ఈఎస్ఐ ఆసుప త్రిని నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో రాబోయే రెండు నెలల్లో ట్రామా కేర్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పట్టణంలో ఈత కొలను నిర్మించేందుకు సుమారు రూ.1.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని, దీన్ని నిర్మించేందుకు పురపాలక ప్రాంతాల్లో రెండు స్థలాలను చూశామన్నారు.