ఒంగోలు, మేజర్న్యూస్ : నాగార్జున సాగర్ జాలాలు వెళుతున్న మార్గాలపై అప్రమత్తంగా ఉండీ...వ్యవసాయానికి కాకుండా త్రాగు నీటి అవసరాలకు వాడుకునే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖామంత్రి శిద్ధా రాఘవరావు అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రి మంత్రి శిద్ధా రాఘవరావు రామతీర్ధం రిజర్వాయర్ను సంబంధిత అధికారులతో సందర్శించారు. నీటి మట్టం వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి శిద్ధా మాట్లాడుతూ రామతీర్ధం రిజర్వాయర్ను సుందరీకరణ చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చి దిద్దుతామనానరు. పల్లె వనం క్రింద రామతీర్ధం గుడి వద్ద పర్యావరణ పార్కును అరవై లక్షల రూపాలయ వ్యవయంతో ఏర్పాటు చేస్తామన్నారు. రామతీర్ధం రిజర్వాయర్కు వచ్చే రహదారిని బిటి రోడ్డుగా నిర్మించేందుకు అతి త్వరలో చర్యలు చేపడతామన్నారు. చీమకుర్తి ఎంఎస్పీ అతిథి గృహానికి మంజూరైన కోటి రూపాయలతో త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. రామతీర్థం రిజర్వాయర్లో నీటి నిల్వ తగ్గిన తరువాత కాలువ గేట్లు మరమ్మత్తులు చేస్తామన్నారు. రైతుల భాగ స్వామ్యముతో పంట సంజీవని ద్వారా భూగర్భ జలాలు పెంపొందిచేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జల వనరుల శాఖ, రైతులకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తోందన్నారు. ఈ పర్యటనలో మంత్రి శిద్ధా తో పాటు జల వనరుల శాఖ ఛీప్ ఇంజనీరు వీర్రాజు, పర్యవేక్షక ఇంజనీరు శారద, మాజీ శాసన సభ్యులు విజయ కుమార్, పౌర సరఫరాల సంస్ధ డైరెక్టర్ మన్నం శ్రీధర్, చీమకుర్తి నగర పంచాయితి చైర్మన్ రాఘవ, నీటి వినియోగ దారుల సంఘం సభ్యులు, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.