విశాఖపట్నం,సూర్యప్రతినిధి: మహిళా సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుందని ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు.ఆదివారం అనకాపల్లి ఎన్టీఆర్ వైద్యాలయంలో టీడీపీ ఆధ్వర్యంలో తల్లుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.ఈసందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం టీడీ పీ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. బాలింతలకు బ్రేడ్ పంపిణి చేశారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని పీలా గోవింద సత్యనారాయణ అన్నారు.