ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవానీ ద్వీపానికి లేజర్‌ కాంతులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 13, 2017, 03:06 AM

అమరావతి నుంచి సూర్య ప్రధాన ప్రతినిధి : అమరావతి రాజధానికి ఆభరణం లాంటి భవానీద్వీపం సమగ్ర అభివ ద్ధికి తొలి అడుగు పడింది. ద్వీపాన్ని పూర్తిస్థాయిలో అభివ ద్ధి చేసేందుకు ఏర్పాటు చేసిన భవానీ ఐలాండ్గ టూరిజం కార్పొరేషన్‌(బి.ఐ.టి.సి)కు తొలి విడతగా రూ.16 కోట్ల నిధులను సర్కారు గురువారం విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. ఈ నిధులతో భవానీద్వీపంలో మల్టీమీడియా లేజర్‌షో, దీనికి అనుబంధంగా మ్యూజికల్‌ డాన్సింగ్‌ ఫౌంటైన్స్‌, వాటర్‌ స్క్రీన్‌లు ఏర్పాటు చేయనున్నారు. దేశంలోనే మరెక్కడా లేనంత ద్వీపం.. భవానీఐలాండ్గ. 132 ఎకరాల్లో స్వచేమైన క ష్ణా మంచినీటి జలాల మధ్యలో ఏర్పడిన ప్రక తి ప్రసాదితం. దీనిలో 15 ఎకరాలు అభివ ద్ధి చేసి ప్రస్తుతం పర్యటకుల కోసం అందుబాటులో ఉంచారు. అయితే.. ఈ 15 ఎకరాల్లోనూ పర్యాటకుల కోసం చేసిన ఏర్పాట్లు నామమ్త్రామే. దీంతో వెళ్లినవాళ్లు వెళ్లినట్టే వెనక్కి వచ్చేస్తున్నారు. అందుకే.. భవానీద్వీపాన్ని పూర్తిస్థాయిలో అభివ ద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అవసరమైన బ హత్తర ప్రణాళికను సైతం సిద్ధం చేశారు. ఈ ప్రణాళికను అమలు చేసేందుకు.. ప్రత్యేకంగా బీఐటీసీని ఏర్పాటు చేసింది. తొలిదశలో భాగంగా అత్యాధునిక లేజర్‌ షోను ఏర్పాటు చేయనున్నారు. విదేశాల్లో ఎంతో ప్రాచుర్యంలో ఉన్న మల్టీమీడియా లేజర్‌షో సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. హైదరాబాద్‌లోని గోల్గొండ కోటలో ఏర్పాటు చేసిన లేజర్‌షో ఇలాంటిదే. అయితే.. ఇక్కడ క ష్ణా జలాలు సైతం అదనపు ఆకర్షణ కావడంతో.. లేజర్‌షోకు అనుబంధంగా మ్యూజికల్‌ ఫౌంటైన్లు, వాటర్‌ స్క్రీన్‌, వాటర్‌ ఎఫెక్ట్‌‌సను సైతం ఏర్పాటు చేయనున్నారు. అదుేతమైన వెలుగు కిరణాల విన్యాసాల మధ్య.. చెవులకు ఇంపుగా ఉండే సంగీతానికి తగ్గట్టుగా నీరు గాలిలోనికి లేచి.. నాట్యం చేస్తున్నట్టుగా ఉండే ఈ ద శ్యాలు అత్యదుేతంగా ఉంటాయి. ప్రస్తుతం భవానీద్వీపంలో ఎలాంటి ఆకట్టే అంశాలు లేకపోవడంతో నిత్యం 500 మంది లోపే వస్తున్నారు. ఆదివారాలు, సెలవుదినాల్లో ఎక్కువ మంది ఉంటారు. నెలకు 15వేల లోపు, ఏటా రెండు లక్షల మంది వరకూ వస్తున్నారు. వీరంతా కేవలం పడవ ప్రయాణంపై ఆసక్తితోనే వస్తున్నారు. ద్వీపంలో ఎక్కువ సమయం ఉండడానికి అవసరమైన ఏర్పాట్లు లేవు. అందుకే నిత్యం వచ్చే సందర్శకుల సంఖ్యను కనీసం ఐదు రెట్లు పెంచాలనేది పర్యాటకశాఖ లక్ష్యం. దీనికోసం అత్యాధునిక ఆకట్టే.. లేజర్‌షోను తొలుత ద్వీపంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com