అమరావతి నుంచి సూర్య ప్రధాన ప్రతినిధి: రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. గోడలకు సున్నం వెలిసి.. కనీసం తరగతి గదులకు తలుపులు లేకుండా కళ తప్పి ఉన్న పాఠశాలలకు కార్పొరేట్ హంగులు అద్దడానికి వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ) విద్యా సంస్థ ముందుకొచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాజధాని కేంద్రంగా విట్ విద్యా సంస్థ ఇంజినీరింగ్ విద్య తరగతులను ప్రారంభించనుంది. వాటి నిర్వహణకు సీఆర్డీఏ సదరు విద్యా సంస్థకు ఐనవోలులో భూమిని కేటాయించింది. అందుకు క తజ్ఞతగా రాజధాని ప్రాంతంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 62 ఉండగా వాటిని అభివ ద్ధి చేయటానికి ఆసక్తి చూపింది. పనుల నిర్వహణపై విద్యాశాఖతో సంప్రదింపులు జరిపింది. కంపెనీల సామాజిక బాధ్యత కార్యక్రమం(సీఎస్ఆర్) కింద విట్ విద్యా సంస్థ ఇప్పటికే తమిళనాడు రాష్ర్టంలోని అనేక పాఠశాలలను దత్తత తీసుకుని అభివ ద్ధి చేసింది. అయితే రాజధాని ప్రాంతంలోని పాఠశాలల అభివ ద్ధికి పెద్దపీట వేస్తామని ఆ సంస్థ చెబుతోంది. జిల్లా విద్యాశాఖ అధికారులను సంప్రదించి పాఠశాలల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవులు అనంతరం తిరిగి ప్రారంభమయ్యే నూతన విద్యా సంవత్సరం(2017-18) నుంచి చాలా వరకు సచివాలయ, డ్కెరెక్టరేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులు తమ పిల్లలను ఏ కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల్లో చేరుద్దామా అనే ఆలోచన వారిలో కలగకుండా చేయటానికి ఈ విద్యా సంస్థలను అత్యున్నతంగా తీర్చిదిద్దటానికి ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. మరోవ్కెపు ప్రభుత్వం కూడా రాజధానిలోని పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు ఒక్కో ఉపాధ్యాయుడు ఉండేలా టీచర్లను సర్దుబాటు చేసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సగటు ఉద్యోగి తమ పిల్లలను చాలా వరకు సర్కారీ పాఠశాలల్లో చేర్చేలా చేయటమే లక్ష్యంగా ఈ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా తయారుచేస్తామని విట్ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్ సౌకర్యాలు కల్పిస్తారు. దీనికోసం పాఠశాలల వారీగా ఉన్న తరగతిగదులు, పిల్లల ప్రవేశాలను పరిగణనలోకి తీసుకుని అత్యాధునిక కంప్యూటర్లు, ఎల్సీడీ ప్రొజెక్టర్లు, తెరలు ఏర్పాటు చేయనున్నారు. రాజధాని ప్రాంతంలో 90 శాతం సర్కారీ పాఠశాలలే ఉన్నాయి. నాలుగైదు మ్త్రామే ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. వాటి అభివ ద్ధికి సంబంధించిన అంచనాలను రూపొందిస్తున్నారు. మరోవ్కెపు వచ్చే విద్యా సంవత్సరంలో తుళ్లూరు కేంద్రంగా ఇంటర్ విద్యను కూడా అందుబాటులోకి తేవడానకి ప్రబుత్వం చర్యలు చేపడుతోంది. ఇంటర్ విద్య తర్వాత ఎలాగూ ఇంజినీరింగ్ విద్యకు రాజధాని ప్రాంతంలో విట్తోపాటు ఎస్ఆర్ఎం కళాశాల నిర్మాణాలు కూడా పూర్తవుతున్నాయి. పాఠశాలలను డిజిటలైజ్ చేయటమే కాదు.. ప్రతి పాఠశాలలో అవసరమైన మరమ్మతులు కూడా చేపట్టనుంది. దీనికి అవసరమైన వ్యయాన్ని కూడా విట్ భరిస్తుంది. ఏ పాఠశాలలో ఏం మరమ్మతులు నిర్వహించాలో వివరాలు తెలియజేయాలని జిల్లా విద్యాశాఖ నుంచి ప్రధానోపాధ్యాయులకు సర్క్యులర్ పంపనున్నారు. దీనిపై గుంటూరు జిల్లా విద్యాశాఖ అధికారి రఘుకుమార్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు, అవసరమైన మరమ్మతుల నిర్వహణకు విట్ విద్యా సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు ఇటీవల తమను సంప్రదించారని వివరించారు. ఇప్పటికే ఏదైనా పాఠశాలలో డిజిటల్ తరగతులు ఉంటే వాటిని కొనసాగిస్తామని లేని పాఠశాలలు మొత్తానికి విట్ సౌజన్యంతో వచ్చే విద్యా సంవత్సరం నాటికి అన్ని పాఠశాలల్లో డిజిటల్ తరగతులు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. రాజధాని ప్రాంతంలోని పాఠశాలల్లో వసతులు, సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధకనబరుస్తుందని చెప్పారు.