ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2019, 05:26 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనదైన మార్క్ పాలనతో దూసుకుపోతున్నారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల విషయంలో నిరుద్యోగలకు భవిష్యత్ చూపించి పారిపాలనా పరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు, యువత, మహిళలకు అందరికీ సంక్షేమం అందించడమే లక్ష్యంగా సాగుతున్న వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు మరోసారి తీపి కబురు చెప్పింది. వైఎస్సార్ ఆదర్శం పేరిట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల ద్వారా వాహనాలు పంపిణీ చేయాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 6 వేల వాహనాల కొనుగోలుకు మార్గదర్శకాలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ బ్యాంకుల రుణాల ద్వారా నిరుద్యోగ యువతకు వాహనాలు మంజూరు చేయనున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న వైఎస్సార్ ఆదర్శ పథకాన్ని పారదర్శకంగా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. కమిటీల పర్యవేక్షణలో అర్హుల ఎంపిక, రుణాలు మంజూరు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com