పోలీస్ శాఖ, యాక్సిస్ బ్యాంకు మధ్య అవగాహనా ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి రామకృష్ణ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చేసుకున్నారు. పోలీసు సిబ్బంది కి వేతనాల ఖాతాపై ఉత్తమ బ్యాంకింగ్ సేవలు అందించేందుకు, ఉచిత వ్యక్తిగత ప్రమాద బీమా భద్రతను అందించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. వ్యక్తిగత ప్రమాద బీమా రూ.30 లక్షలు ఉగ్రవాద దాడిలో మరణిస్తే మరో రూ.10 లక్షలు మొత్తం కలిపి రూ.40 లక్షలకు వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం కల్పించారు. వ్యక్తిగత ప్రమాద బీమా హోంగార్డులకు కూడా వర్తింపచేశారు. యాక్సిస్ బ్యాంకు డెబిట్ కార్డు ద్వారా మరో ఐదు రకాల ఇన్సూరెన్స్ పథకాలు పోలీస్ సిబ్బందికి వర్తిస్తుందని తెలిపారు.