ఏపీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రాలకు నూతనంగా 16 మంది ఐఏఎస్లను నియమించింది కేంద్రం. ఏపీ రాష్ట్రానికి 9 మంది, తెలంగాణకు ఏడుగురు ఐఏఎస్ అధికారులను నియమిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్దాకా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో పలు శాఖలకు సంబంధించి ఐఏఎస్ల అవసరం ఏర్పడింది. అయితే తెలంగాణలో 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చడంతో జిల్లాకో ఐఏఎస్ అధికారి అవసరం ఏర్పడింది. అయితే అటు ఏపీలో కూడ జిల్లాల పెంపుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనున్న నేపధ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాలకు కొత్తగా ఐఏఎస్ అధికారులను కేటాయించడం తీపికబురు కబురే.