అమరావతి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై నెలకు రెండుసార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయించారు. ప్రతి నెల 2, 4వ బుధవారాల్లో కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం నిర్ణయం నేపథ్యంలో అన్ని శాఖల కార్యదర్శులకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆదేశాలు జారీ చేశారు. కేబినెట్లో చర్చించే అంశాలను అన్ని శాఖల అధికారులు మూడు రోజుల ముందుగానే పంపించాలని సీఎస్ సూచించారు.