యురేనియం తవ్వకాలను వెంటనే ఆపాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో యురేనియం తవ్వకాలు జరుపుతుంటే... ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. యురేనియంపై తవ్వకాలకు వ్యతిరేకంగా నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశానికి వైసీపీ నేతలు డుమ్మా కొట్టారని, ఆదివారం ఓబుళపల్లెలో జరిగే అఖిలపక్ష పోరాటానికి ప్రభుత్వ మద్దతు ఉందా? లేదా? అని ప్రశ్నించారు. యురేనియం ప్లాంటుకు అనుమతులిచ్చి మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి నల్లమలకు ముప్పు తెచ్చారని ఆరోపించారు. ఇప్పుడు సీఎం జగన్ రైతులకు అన్యాయం చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.