ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం మంగళవారం నరసరావుపేట మొదటి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల, ఆయన కుటుంబంపై కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి తాము ఎలాంటి తప్పు చేయలేదని పేర్కొంటూ కోడెల తనయుడు శివరాం ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో ఆయన ఇవాళ కోర్టులో లొంగిపోయి.. మరికొద్ది సేపటిలో బెయిల్ ద్వారా బయటకు రానున్నారు.