ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర ప్రజలకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలి : గవర్నర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2019, 01:01 PM

విజయవాడలో గవర్నర్‌ హరిచందన్‌ దంపతులు నేడు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. గవర్నర్‌ దంపతులకు అర్చకులు ఆశీర్వచనాలు పలికారు.ఈవో సురేష్‌బాబు ఆలయ మర్యాదలతో గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు.ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు కనకదుర్గమ్మ గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు.భిస్వ భూషణ్ హరి చందన్ గవర్నర్  మాట్లాడుతూ రాష్ట్రానికి,రాష్ట్ర ప్రజలకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలకు దసరా శుభాకాంక్షలు. దుర్గమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉంది రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉత్సవ ఏర్పాట్లు భేష్ గా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా దుర్గమ్మ ఆలయం నిలుస్తుంది. నవరాత్రులు సందర్భంగా ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటున్నాను


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com