ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఉల్లి ధరలను అదుపు చేసేందుకు కేంద్రం నివారణ చర్యలు చేపట్టింది. దేశంలో ఉల్లి ధరలు భారీగా పెరిగిపోవడంతో కేంద్రం ఎగుమతులపై నిషేధం విధించింది. ఉల్లితో పాటు అన్ని రకాల ఎగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. కొన్నిచోట్ల ఉల్లి ధర కిలో ఒక్కంటికి రూ.85కి చేరుకుంది. ఉల్లి ధరలను నియంత్రించేందుకు ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు చర్యలు తీసుకుంటున్నాయి. రైతు బజార్లలో ప్రత్యేక స్టాళ్లను పెట్టి తక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. ఉల్లి ధర పెరిగిపోతుండడంతో ఏపీలో ఇటీవల ఏపీ సర్కారు చర్యలు తీసుకుంది. రైతుబజార్లలో రూ.25కే కిలో ఉల్లి విక్రయించేలా చర్యలు తీసుకుంది. ఉల్లి కృత్రిమ కొరత సృష్టించడం వల్లే ఉల్లి ధర పెరుగుతోందని ప్రభుత్వం పేర్కొంది. ఉల్లి కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఉల్లి ధరను, కొరతను నివారించేందుకు ఏపీ సర్కారు ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని దిగుమతికి చర్యలు తీసుకుంది.