గుంటూరు జిల్లా, తెనాలి మండలం, చావావారిపాలెం డొంకలో కొందరు జూదమాడుతున్నారన్న సమాచారం అందడంతో గ్రామీణ పోలీసులు రాత్రి దాడి చేశారు. జూదమాడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 62,700 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.