ఎనిమిది లక్షలు ఖరీదు చేసే ఉల్లిపాయలను దొంగలించారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో జరిగింది. పాట్నాకు సమీపంలో ఉన్న ఫతువా గోడౌన్లో నిలువ చేసిన ఉల్లిపాయలు గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఆ గౌడన్ నిర్వహిస్తున్న వ్యాపారి ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో విచారణ మొదలుపెట్టినట్లు పోలీసులు తెలిపారు.