అంతా బాగుందంటూ అమెరికా హ్యూస్టన్ ఎన్ఆర్జీ స్టేడియంలో ప్రధాని మోడీ చేప్పిన మాటలపై ప్రవాస భారతీయుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. శనివారం రాత్రి జరిగిన హౌడీ-మోడీ సభకు హాజరైన ప్రధాని మోడీ తెలుగుతో పాటు భారత్లోని అనేక భాషల్లో దేశంలో పరిస్థితిపై వస్తున్న ఆందోళను సహేతుకం కాదని... ఇప్పుడు అంతా బాగుందని వ్యాఖ్యలు చేసారు. హ్యూస్టన్ వాసులు చెప్పిన అపూర్వ స్వాగతం తను ఎన్నడూ మర్చిపోలేనని మోడీ అన్నారు.
ఈ సందర్భంగా ధన్యవాదాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచంలో ఏ వ్యాపారం అయినా రాజకీయాలైనా అన్నింట ట్రంప్ చిరపరిచితులే అని విశ్వ వ్యాప్తంగా ఆతని పేరు తెలియని వారు ఉండరన్నది ఎంత సత్యమో... ప్రపంచంలో ఏ 10 మంది సంభాషణలో ఖచ్చితంగా ట్రంప్ ప్రస్తావన ఉంటుందని అన్నారు. ప్రపంచ ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్న ఆతనితో కలసి పనిచేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని, ఈ క్రమంలో ట్రంప్ మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు ప్రధాని మోడీ.