కర్నూల్ జిల్లా, గడివేముల మండలం సోమాపురంలో దారుణం చోటు చేసుకుంది. కాపురానికి రమ్మని పిలిచిన భర్తపై భార్య దాడి చేసింది. భర్తను కట్టేసి భార్య, బంధువులు దారుణంగా కొట్టారు. అక్కడితో ఆగక.. భార్య హసీనా భర్త మర్మాంగం కోసేసింది. తీవ్ర రక్తస్త్రావం కావడంతో భర్త స్పృహ తప్పిపడిపోయాడు. దీంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.