యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్సి) సివిల్ సర్వీసులకు నిర్వహించే మెయిన్స్ పరీక్షలు రేపటినుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు ఈ నెల 29వ తేదీ వరకూ జరుగుతాయి. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షల్లో క్వాలిఫై అయిన వారు మెయిన్స్ పరీక్ష రాయడానికి అర్హులు. ఈ ఏడాది 11,845 మంది అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించారు.