రాజమహేంద్రవరం:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. బోటు ప్రమాద స్థలం వద్ద ఏరియల్ సర్వే నిర్వహించిన అనంతరం సీఎం జగన్ రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి బయటపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జగన్ పరామర్శించారు. జగన్ వెంట మంత్రులు, అధికారులు ఉన్నారు.