సినీ నటుడు, గోరఖ్పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానం అత్యవసరంగా గ్వాలియర్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయ్యింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఆయన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో.. అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. రవికిషన్ మీడియాతో మాట్లాడుతూ.. ఎటువంటి ప్రమాదం జరగకముందే.. సమయానికి లోపాన్ని గుర్తించారని.. ఆ భోలే బాబా తనను రక్షించాడన్నారు.