పాకిస్థాన్ ఆర్మీ బలగాలు భారత జవాన్లపై కాల్పులు జరిపింది. జమ్ముకశ్మీర్ లోని దేశ సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. పూంఛ్ జిల్లాలో ఈ మధ్యాహ్నం ఒంటిగంటకు పాకిస్థాన్ బలగాలు ఇండయన్ ఆర్మీపై ఫైరింగ్ జరిపాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని భారత ఆర్మీ ప్రకటించింది. కాల్పులను భారత సైన్యం తిప్పికొడుతున్నట్టు తెలిపింది.