ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్ బృందాన్ని వెనక్కి పంపిన కశ్మీర్ అధికారులు

national |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2019, 05:39 PM

ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూకశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులను పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు పలువురు విపక్ష నేతలు శ్రీనగర్ వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే, వీరందరినీ అక్కడి పోలీసు అధికారులు తిరిగి వెనక్కి పంపారు. ఇక్కడ పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని చెప్పి వారిని తిప్పి పంపారు.


రాహుల్ వెంట వెళ్లిన నేతలలో సీపీఎం నేత సీతారాం ఏచూరి, ఆర్జేడీ నేత మనోజ్ ఝా, టీఎంసీ నేత దినేశ్ త్రివేది, డీఎంకే నేత తిరుచ్చి శివ తదితరులు ఉన్నారు. వీరంతా శ్రీనగర్ కు బయల్దేరక ముందే వీరిని ఉద్దేశించి జమ్మూకశ్మీర్ సమాచార, పౌరసంబంధాల శాఖ అధికారులు ట్వీట్ చేశారు. ఇక్కడకు రావద్దని, ప్రజలను అసౌకర్యానికి గురి చేయవద్దని ట్విట్టర్ ద్వారా కోరారు. ఉగ్రవాదుల నుంచి జమ్మూకశ్మీర్ ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం యత్నిస్తోందని... దీనికి అందరూ సహకరించాలని విన్నవించారు. అయినప్పటికీ రాహుల్ నేతృత్వంలోని నేతల బృందం శ్రీనగర్ చేరుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com