మోదీ ప్రధాని పీఠం అధిరోహించాక జిఎస్టీ , నోట్లరద్దు ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370 రద్దు ఇలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు కాగా, మోదీ ప్రభుత్వం తదుపరి టార్గెట్ రిజర్వేషన్ల రద్దుగా సామాజిక మీడి యాలో వినిపిస్తోంది. ఆరెస్సెస్ ఆమోదం పొందాకే దీనిని ఆచరణలోకి తీసుకు వస్తున్నారనేందుకు తాజాగా, ఆగస్టు 19న ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్లపై చేసిన కామెంట్లే ఆధారం అయితే, మోహన్ భగవత్ ఏ అంశం పై అయినా మాట్లాడితే దాన్ని మోదీ ఆచరణలో పెట్టడం ఇదివరకు చాలా సార్లు మనం గమనించాం కూడా.
గడిచిన ఎన్నికల్లో ఓబిసిల ఓట్ల శాతాన్ని భారీగా పెంచుకున్న మోదీ, రిజర్వేషన్ల రద్దు చట్టాన్ని చట్టబద్దం చేస్తే వారి మద్దతు సంపూర్నంగా లభిస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మనీష్ తివారీ, జనార్దన్ ద్వివేది వంటి వారు ఇప్పటికే రిజర్వేషన్లపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. దాంతో వాచ్చే పార్లమెంట్ సమావే శాల్లో ఈ అంశం పై అన్ని పక్షాలతో చర్చ జరగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.