ఏపీ ముఖ్యమంత్రి జగన్ గత వారం రోజులుగా అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ఈ నెల 15న అమెరికా వెళ్లారు. నేటితో ఆయన పర్యటన ముగిసింది. ఈ ఉదయం (భారత కాలమానం ప్రకారం) చికాగో నుంచి హైదరాబాద్ బయల్దేరారు. ఆయన రేపు ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. జగన్ వ్యక్తిగత పనిపై అమెరికా వెళ్లారు. చిన్నకుమార్తె వర్షా రెడ్డి కాలేజి అడ్మిషన్ కోసం కుటుంబ సమేతంగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా అమెరికాలో అనేక కార్యక్రమాలకు కూడా ఆయన హాజరయ్యారు. ముఖ్యంగా, ఎన్నారైలతో డల్లాస్ లో జరిగిన సమావేశానికి విశేష స్పందన లభించింది.